Home> జాతీయం
Advertisement

NEET PG Exam Postponed: నీట్ విద్యార్ధులకు శుభవార్త, 6-8 వారాల వరకు పీజీ పరీక్ష వాయిదా

NEET PG Exam Postponed: నీట్ పీజీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష వాయిదా విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
 

NEET PG Exam Postponed: నీట్ విద్యార్ధులకు శుభవార్త, 6-8 వారాల వరకు పీజీ పరీక్ష వాయిదా

NEET PG Exam Postponed: నీట్ పీజీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష వాయిదా విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పీజీ పరీక్ష విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మార్చ్ 12వ తేదీన జరగాల్సిన నీట్ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్దులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోవిడ్ విధుల్లో ఉన్నందున ఇంటర్న్‌షిప్ పూర్తి కాలేదని..ఫలితంగా నీట్ పీజీ పరీక్షకు అనర్హులవుతున్నామనేది విద్యార్ధుల వాదన. ఈ క్రమంలో పీజీ పరీక్షల్ని వాయిదా వేయడమే కాకుండా..ఇంటర్న్‌షిప్ గడువు పెంచాలని కోరారు. ఈ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. 

మరోవైపు ఇదే విషయంమై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా (NEET PG Exam Postponed) వేసింది. ఏకంగా 6 నుంచి 8 వారాలకు పరీక్ష వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇంకా తుది వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్షపై సుప్రీంలో నేడు విచారణ, పరీక్ష వాయిదా పడే అవకాశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More