Home> జాతీయం
Advertisement

జీఈఎస్ సదస్సులో మోడీ స్పీచ్ హైలెట్స్

మహిళ ఒక శక్తికి రూపం. నేను మహిళా వికాసం మన వికాసానికి ఆధారమని నమ్ముతాను. 

జీఈఎస్ సదస్సులో మోడీ స్పీచ్ హైలెట్స్

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భారత ప్రధాని ప్రసంగించారు. మహిళా సాధికారతను పెంపొందించే ఈ ప్రపంచ సదస్సు భారతదేశంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో ఈ సదస్సుకు అమెరికన్ ప్రభుత్వం సలహాదారు ఇవాంకా ట్రంప్ రావడం హర్షణీయమని చెప్పారు. సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు మీకోసం..! 

  • మహిళ ఒక శక్తికి రూపం. నేను మహిళా వికాసం మన వికాసానికి ఆధారమని నమ్ముతాను. 
  • గార్గి, రాణీ లక్ష్మీబాయి, రాణీ అహల్యాబాయి వంటి మహిళలు మాకు ఎంతో ఆదర్శం. 
  • మార్స్ ఆర్బిటర్ మిషను విజయంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా వంటి అమెరికన్ వ్యోమగాములు కూడా భారతీయ సంతతి మహిళలే. 
  • భారతీయ మంత్రులలో కూడా మహిళలకు ప్రత్యేక స్థానం దక్కింది. 
  • హైదరాబాద్ నగరం పివిసింధు, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లాంటి గొప్ప క్రీడాకారిణులకు పుట్టినిల్లు. 
  • గుజరాత్ పాల సరఫరా సంఘం ఆవిర్భావంలో కూడా మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది.  భారతదేశంలో మహిళా కోఆపరేటివ్ వ్యవస్థ వెలుగొందడానికి వారు ఆదర్శప్రాయులయ్యారు. 
  • నేడు మనం బైనరీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. కానీ జీరో పుట్టిందే భారతదేశంలో కదా..!
  • ఇలాంటి సదస్సులు సిలికాన్ వ్యాలీ. హైదరాబాద్ నగరాలనే కాదు. భారత్, అమెరికా మధ్య ఉన్న అనుబంధాన్ని పటిష్టం చేస్తాయి.

 

 

Read More