Home> జాతీయం
Advertisement

కూతురును చంపిన తండ్రి.. మహారాష్ట్రలో ఘోరం..

ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సొంత కూతురినే సుత్తెతో చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. విరార్‌ ప్రాంతంలో దత్తారాం జోషి (54) అనే వ్యక్తి తన 20 సంవత్సరాల 

కూతురును చంపిన తండ్రి.. మహారాష్ట్రలో ఘోరం..

హైదరాబాద్: ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సొంత కూతురినే సుత్తెతో చంపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. విరార్‌ ప్రాంతంలో దత్తారాం జోషి (54) అనే వ్యక్తి తన 20 సంవత్సరాల కుమార్తెను అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, తిరుపతి నగర్‌లో స్థానికంగా ఉన్న కళాశాలలో బీఎస్సీ చదువుతున్న కుమార్తెను దత్తారాం తన భార్య, కొడుకు ఇంట్లో ఉన్న సమయంలోనే సుత్తెతో తలపై బలంగా కొట్టి చంపాడు. 

Also Read: ఉక్కపోతలతో ఉడుకుతున్న ఢిల్లీ..

ఇదిలాఉండగా హత్య జరిగిన తరవాత ఇంట్లో వారు మాత్రం పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అనుమానాస్పద హత్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి అమ్మాయి మరణించి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు జోషి తన కూతురును ఎందుకు చంపాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఆ వ్యక్తి తన కుమార్తెను ఎందుకు హత్య చేశాడన్న విషయాలు ఇంకా తెలియరాలేదని, దీంతో ఇతర మార్గాల్లో కేసును విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More