Home> జాతీయం
Advertisement

సభామర్యాద పాటిస్తూ నిరసన చేయాలి: అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ టీడీపీ ఎంపీలకు పార్లమెంటులో సూచనలు చేశారు.

సభామర్యాద పాటిస్తూ నిరసన చేయాలి: అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ టీడీపీ ఎంపీలకు పార్లమెంటులో సూచనలు చేశారు. వారిని తను తప్పు పట్టడం లేదని.. కానీ సభామర్యాదను పాటిస్తూ.. టీడీపీ నేతలు నిరసనను వ్యక్తం చేయాలని ఆయన అన్నారు.

వెల్‌లోకి చొచ్చుకువస్తున్న టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ఆయన ఆ సూచనలు చేశారు. అయితే తమకు గత్యంతరం లేకే అలా రావాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అద్వానీ వ్యక్తిగతంగా టీడీపీ ఎంపీలతో 10 నిమిషాలు మాట్లాడారు.

తాను ఇదివరకే జైట్లీతో ఏపీ విషయమై మాట్లాడానని ఆయన అన్నారు. ఈ రోజు కూడా టీడీపీ నేతలు చేసిన రాద్ధాంతం వల్లే సభ వాయిదా పడింది. అకాళీదల్, శివసేన, తృణాముల్ కాంగ్రెస్ పార్టీలు కూడా టీడీపీకి తమ మద్దతు ప్రకటించాయి. ఏపీ ఎంపీల నిరసనలకు మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఎంపీ కవిత కూడా సభాముఖంగా ప్రకటించారు

Read More