Home> జాతీయం
Advertisement

ఉగ్రవాద సంస్థలో చేరిన పోలీస్ అధికారి

ఉగ్రవాద సంస్థలో చేరిన పోలీస్ అధికారి

ఉగ్రవాద సంస్థలో చేరిన పోలీస్ అధికారి

జమ్ము కాశ్మీర్‌లో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (ఎస్పీఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదిల్‌ బషీర్‌ అనే అధికారి హిజ్బుల్‌ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో చేరాడు. గతవారం సెప్టెంబర్ 28న జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్ లోని జవహర్ నగర్ ఏరియా లో పీడీపీ ఎమ్మెల్యే అజీజ్ మీర్ అధికారిక నివాసం నుంచి ఏకే 47 గన్స్‌తో పాటు ఆయుధాలను బషీర్ ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

అయితే అదిల్ బషీర్.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు సోమవారం నిర్ధారించారు. హిజ్బుల్ సంస్థ కమాండర్ జీనత్ ఉల్ ఇస్లాం పక్కనే  అదిల్ బషీర్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకే 47 గన్ తో బషీర్ ఫోటోలో కనిపిస్తున్నాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More