Home> జాతీయం
Advertisement

Terror Attack: పోలీసుల బస్సుపై ఉగ్రదాడి...ముగ్గురు మృతి, శ్రీనగర్‌లో ఘటన

Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసుల బస్సు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా...11 మంది గాయపడ్డారు.

Terror Attack: పోలీసుల బస్సుపై ఉగ్రదాడి...ముగ్గురు మృతి, శ్రీనగర్‌లో ఘటన

Terror Attack In Srinagar: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి దాడుల(Terror Attack)కు పాల్పడ్డారు. శ్రీనగర్(Srinagar) శివారు పంతాచౌక్ వద్ద  జెవాన్(Zewan) ప్రాంతంలో పోలీసుల బస్సు(Police Bus)పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా...11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి..చికిత్స అందిస్తున్నారు.

Also Read: Massive Fire Accident: హిమాచల్ ప్రదేశ్​లో ఘోర అగ్నిప్రమాదం...27 ఇళ్లు, 26 గోశాలలు దగ్ధం..!

దాడి సమాచారం తెలుసుకున్న అధికారులు అలర్ట్ అయ్యారు. అదనపు బలగాల్ని రంగంలోకి దింపి..ఘటనా స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి రోజు దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రతి నిత్యం భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నా..ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More