Home> జాతీయం
Advertisement

మరో నెల రోజులు జియో ఫోన్ ఆఫర్

మరో నెల రోజులు జియో ఫోన్ ఆఫర్

మరో నెల రోజులు జియో ఫోన్ ఆఫర్

ముంబై: దీపావళి ఆఫర్స్‌లో భాగంగా తాము తీసుకొచ్చిన ‘జియో ఫోన్‌ దీపావ‌ళి 2019 ఆఫ‌ర్‌`కు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చిందని రిలయన్స్ జియో ప్రకటించింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించడం ఈ ఆఫర్ ప్రత్యేకత. అంతేకాకుండా మొదటి ఏడు రీచార్జులకు రూ.99 విలువైన డేటాను అదనంగా అందించనుంది. 

మూడు వారాల పాటు రూ.699కే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించి, ఎక్కువ మొత్తంలో జియో ఫీచర్ ఫోన్స్ అమ్ముడుపోయిన నేపథ్యంలో ఈ ఆఫర్‌ను మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. అదనంగా లభిస్తున్న రూ.700 (7రీచార్జులు*రూ99) విలువైన డేటాతో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పేమెంట్స్‌, ఈకామ‌ర్స్‌, విద్య, శిక్ష‌ణ‌, రైలు, బ‌స్ బుకింగ్‌ లాంటి ఎన్నో సౌకర్యాలు పొందవచ్చని జియో ఈ ప్రకటనలో పేర్కొంది.

Read More