Home> జాతీయం
Advertisement

Covid Cases: దేశంలో కొవిడ్ కల్లోలం.. 20 వేలు దాటిన రోజువారి కేసులు.. వైద్యశాఖ హై అలర్ట్

Covid 19 Updates : దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. న్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా  20 వేల 038  కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 47 మంది చనిపోయారు.

Covid Cases: దేశంలో కొవిడ్ కల్లోలం.. 20 వేలు దాటిన రోజువారి కేసులు.. వైద్యశాఖ హై అలర్ట్

Covid 19 Updates : దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. న్నటితో పోల్చితే ఇవాళ కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా  20 వేల 038  కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ సోకిన మరో 47 మంది చనిపోయారు. తాజా మృతులతో  దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5 లక్షల 25 వేల 604కి పెరిగింది.

గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో  16 వేల 994 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 39 వేలు దాటింది. దేశంలో రికవరీ రేటు 98.49 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. పాజిటివిట్ రేటు 4.46 శాతంగా ఉంది. కొవిడ్ రోజువారి కొత్త కేసులు 20 వేలు దాటిపోవడం వైద్య శాఖ వర్గాలను కలవరపరుస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న మరో 18 లక్షల 92 వేల 969 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 199 కోట్ల 47 లక్షల 34 వేల 994 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Read also: Godavari Flood: రూ. వేల కోట్లు నీటి పాలు.. వరదల్లో మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు.. కేసీఆర్ సిగ్గుపడాలన్న బండి సంజయ్

Read also: Telangaan Floods:కాళేశ్వరం బ్యారేజీకి రివర్స్ వరద.. కంట్రోల్ రూమ్ లో చిక్కుకుపోయిన 105 మంది సిబ్బంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More