Home> జాతీయం
Advertisement

మొబైల్ ఫోన్ల తయారీలో.. ఇండియా నెంబర్ 2..!

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశాల్లో భారతదేశంలో రెండవ స్థానం ఉందని .. మొదటి స్థానంలో ఇంకా చైనా కొనసాగుతుందని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ తెలిపింది.

మొబైల్ ఫోన్ల తయారీలో.. ఇండియా నెంబర్ 2..!

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉందని .. మొదటి స్థానంలో ఇంకా చైనా కొనసాగుతుందని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఐసీఏ జాతీయ అధ్యక్షులు పంకజ్ మొహింద్రా ఈ మేరకు కేంద్రమంత్రులు అందరికీ రాసిన ఉత్తరంలో ఈ విషయాన్ని కూడా పంచుకున్నారు.

మార్కెట్ రిసెర్చి కంపెనీ ఐహెచ్‌ఎస్‌తో పాటు వియత్నాంలోని జనరల్ స్టాటిస్టిక్స్ ఆఫీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించాయని ఆయన తెలిపారు. గతంలో వియత్నాం మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉండగా.. ఈ సారి ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది.

ఇటీవలే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థగా పనిచేసే ఫాస్ట్ ట్రాక్ టాస్క్ ఫోర్సు ఓ ప్రకటన చేస్తూ 2019 సంవత్సరానికల్లా 500 మిలియన్ల మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశంగా భారత్‌ను చూడాలన్నదే లక్ష్యమని తెలిపింది. అలాగే వచ్చే సంవత్సరం నాటికి 120 మిలియన్ల మొబైల్‌ ఫోన్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది. 

Read More