Home> జాతీయం
Advertisement

India Covid-19: 50లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది.

India Covid-19: 50లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 95వేలు దాటింది. గత 24గంటల్లో ఆదివారం ( సెప్టెంబరు 27న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా 1,039 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,74,703 కి చేరగా..  మరణాల సంఖ్య 95,542 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 50,16,521 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,62,640 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఆదివారం దేశవ్యాప్తంగా 7,09,394 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 27 వరకు మొత్తం 7,19,67,230 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 82.58 శాతం ఉండగా.. మరణాల రేటు 1.57 శాతం ఉంది. Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి

Read More