Home> జాతీయం
Advertisement

భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్(India COVID19 cases) రోజురోజుకూ విజృంభిస్తోంది. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నా, భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది.

భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు

భారత్‌లో కరోనా వైరస్(COVID19 cases in India) రోజురోజుకూ విజృంభిస్తోంది. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నా, భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 20,903 కరోనా పాజిటివ్‌ కేసులు(CoronaVirus Cases) నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కోవిడ్19 కేసులలో ఇదే అత్యధికం. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (India COVID19 Cases) 6,25,544కు చేరింది. ఇకపై వారికి హోమ్ క్వారంటైన్ ఉండదు

అదే సమయంలో గత 24 గంటల్లో దేశంలో 379 మంది కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 18,213కు చేరుకుంది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం 3,79,892 మంది ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,27,439 మంది ఆస్పత్రులలో కోవిడ్19కు చికిత్స పొందుతున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

జులై 2 వరకు దేశంలో మొత్తం 92,97,749 శాంపిల్స్ పరీక్షించారు. అందులో నిన్న ఒక్కరోజే 2,41,576 శాంపిల్స్‌కు కోవిడ్19 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) తెలిపింది.  మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అధిక కేసులతో పాటు అత్యధిక కోవిడ్19 మరణాలు ఆ రాష్ట్రాలలో సంభవిస్తున్నాయి.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Read More