Home> జాతీయం
Advertisement

కరుణానిధి ఆరోగ్యం విషమం ..!?

కరుణానిధి ఆరోగ్యం విషమం ..!?

తమిళనాడు రాష్ట్రం అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యముపై వస్తున్న వదంతుల నేపథ్యములో డీజీపీ రాజేంద్రన్ అన్ని జిల్లా ఎస్పీ లకు హైఅలర్ట్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, అధికారులు బందోబస్తు విధులకు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశించారు.  గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకోవడంతో అసలు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ  తమిళనాట నెలకొంది. ఇదే విషయాన్ని పోలీసులకు అడిగితే రెగ్యులర్ గా ఉండే డ్యూటీయే అని చెప్పుకొచ్చారు.  

ఇదిలా ఉండే డీఎంకే చీఫ్ కరుణానిధి ఆరోగ్యముపై వస్తున్న వదంతులు అవాస్తవమని కొట్టిపారేశారు ఆయన కుమార్తె, ఎంపీ కనిమొళి. మరోవైపు చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, ఆమె జైలు నుండి పెరోల్ మీద వచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వస్తే ఆమె మద్దతుదారులు హింసలకు దిగి, ప్రజాధనాన్ని నష్టం కలిగించొచ్చన్న సమాచారంతో ముందస్తు భద్రత పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read More