Home> జాతీయం
Advertisement

మాజీ రేడియో జాకీ మృతి

సోమవారం మాజీ రేడియో జాకీ స్టూడియోలో చనిపోయాడు.

మాజీ రేడియో జాకీ మృతి

సోమవారం రాజేష్ అనే మాజీ రేడియో జాకీని కొందరు గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా గాయపరిచారు. గాయాల తీవ్రత అధికంగా ఉండడం వల్ల రాజేష్ ఆసుపత్రిలో మరణించాడు. సోమవారం రాత్రి తిరువనంతపురంలోని మదువారులోని సొంత స్టూడియోలోనే ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు గాయపరిచారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు.

రాజేష్ తన స్నేహితుడితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొని... స్టూడియోకి తిరిగివచ్చి తమ పరికరాలను ఉంచుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఎరుపు రంగు మారుతి స్విఫ్ట్ కారులో వచ్చి వారిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని నివేదికలు తెలిపాయి.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజేష్ మరియు అతని స్నేహితుడిని ఆసుపత్రికి తరలించారు. గాయాల తీవ్రత కారణంగా రాజేష్ మరణించారు. అతని స్నేహితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రాజేష్ ఎన్నో సంవత్సరాలుగా రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేశాడు. దోహాలో కేరళ ఎఫ్ఎం స్టేషన్‌లో పనిచేశాడు. ఇటీవలి కాలంలో దోహా నుంచి తిరిగి వచ్చి మిమిక్రీ బృందంలో చేరాడు.

 

Read More