Home> జాతీయం
Advertisement

కాన్వాయ్ ఆపి రోడ్డు ప్రమాదం బాధితుడికి సహాయం చేసిన మాజీ సీఎం

కాన్వాయ్ ఆపి రోడ్డు ప్రమాదం బాధితుడికి సహాయం చేసిన మాజీ సీఎం

కాన్వాయ్ ఆపి రోడ్డు ప్రమాదం బాధితుడికి సహాయం చేసిన మాజీ సీఎం

భోపాల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఓ వ్యక్తిని ఆదుకుని అతడిని ఆసుపత్రికి చేర్చేందుకు సహాయపడిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవును, శుక్రవారం భోపాల్-జైట్ రహదారిపై వెళ్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కి అదే రహదారిపై ప్రమాదంలో గాయపడి నిస్సహాయ స్థితిలో వున్న ఓ ద్విచక్రవాహనదారుడు కనిపించాడు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించి తన సిబ్బంది సహాయంతో అతడికి అండగా నిలిచారు. బాధితుడిని అంబులెన్స్‌లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించేందుకు తన వంతు సహాయం అందించారు. శివరాజ్ సింగ్ చూపించిన మానవత్వం నెటిజెన్స్ మనసు దోచుకుంది.

Read More