Home> జాతీయం
Advertisement

శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి; కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకాశ్మీర్‌లో సంజ్వాన్ ఉగ్రదాడిని మరువక ముందే.. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు.

శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి; కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకాశ్మీర్‌లో సంజ్వాన్ ఉగ్రదాడి మరువక ముందే.. పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం 4:30 గంటల సమయంలో శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారి వద్ద బ్యాగులు, ఏకే 47 తుపాకీలు ఉన్నాయి. ఉగ్రవాదుల దాడులను జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతున్నారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

 

కాగా, సంజ్వన్ ఆర్మీ స్థావరం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురు ఆర్మీ సిబ్బందికి, ఆరుగురు పౌరులకు గాయాలయ్యాయి. జవాన్లు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ప్రస్తుతం ఆర్మీ క్యాంప్ వద్ద కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

 

Read More