Home> జాతీయం
Advertisement

లాలూజీ.. శాకాహారిగా మారిపోయారా..?

ఆర్జేడీ అధ్యక్షుడు మరియు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదద్ శాకాహారిగా మారిపోయారట.

లాలూజీ.. శాకాహారిగా మారిపోయారా..?

ఆర్జేడీ అధ్యక్షుడు మరియు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదద్ శాకాహారిగా మారిపోయారట. తన కుటుంబ జ్యోతిష్యుడు సూచించిన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా వ్యక్తిగతంగా మరియు రాజకీయపరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సందర్భంలో కొన్నాళ్లు మాంసాహారానికి దూరంగా ఉండి.. శివారాధనలో మునిగితేలాలని జ్యోతిష్యుడు చెప్పిన మీదట లాలూ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

గతంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ తాను మాంసాహారం మానేస్తానని స్వయంగా ప్రకటించారు. తనకు సాక్షాత్తు పరమశివుడు కలలో కనిపించి మాంసాహారం మానేయాలని చెప్పారని ఆయన తెలిపారు. అయితే కొన్నాళ్ళకే మళ్లీ ఆ దీక్షను విరమించుకున్నారు. ప్రస్తుతం తనకు బాగా సన్నిహితుడైన ఓ జ్యోతిష్యుడు చెప్పిన మీదట మళ్ళీ శాకాహారిగా మారిపోవాలని భావిస్తున్నారట లాలూ.

మీకో చిత్రమైన విషయం తెలుసా.. లాలూకీ చేపల కూర అంటే ఎంతో ఇష్టమట. తానే స్వయంగా చేపల కూర వండుకొని తినడమంటే మరీ ఇష్టమట. మరి ఈ కూర వాసన తన దీక్షను ఎన్నాళ్లు భగ్నం చేయకుండా ఉంటుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే..!

 

Read More