Home> జాతీయం
Advertisement

పనిమనిషి జీతం అడిగిందని ముక్కలుగా నరికేశాడు

పనిమనిషి జీతం అడిగిందని ముక్కలుగా నరికేశాడు ఓ యజమాని.

పనిమనిషి జీతం అడిగిందని ముక్కలుగా నరికేశాడు

న్యూఢిల్లీ: జార్ఖండ్ నుంచి ఇంటి పనుల కోసం తెచ్చుకున్న 16 ఏళ్ల యువతి జీతం అడిగిందని ఆ యజమాని ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఈ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసుల కధనం మేరకు, మన్‌జీత్‌ కర్కేటా (30) ఢిల్లీలోని పశ్చిమ విహార్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం 16ఏళ్ల యువతిని జార్ఖండ్‌ నుంచి రప్పించుకొని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. జీతం అడిగినప్పుడల్లా.. డబ్బులతో నీకేం పని, ఇస్తాలే అనేవాడు.. కానీ ఇచ్చేవాడు కాదు. ఇక ఆ యువతి చేసేదేమిలేక ధైర్యం చేసి జీతం ఇవ్వకుంటే సొంతూరుకు పోతానని తేల్చిచెప్పడంతో ఆ యజమానికి కోపం వచ్చింది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మరో ఇద్దరి సాయంతో బాలికను హత్య చేశాడు.

ఆతరువాత మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి డ్రైనేజీలో పడేయగా మే 4న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మన్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. జీతం డబ్బులు అడిగినందుకే ఓ మహిళ సహా ఇద్దరి సాయంతో బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు.

 

Read More