Home> జాతీయం
Advertisement

Coronavirus New Strain: దేశంలో 114కు చేరిన న్యూ స్ట్రేయిన్ కేసులు

దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Coronavirus New Strain: దేశంలో 114కు చేరిన న్యూ స్ట్రేయిన్ కేసులు

Coronavirus New Strain Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. భారత్‌లో యూకే స్ట్రేయిన్ కేసుల సంఖ్య తాజాగా 114కు చేరింది. నిన్నటి వరకు దేశంలో కొత్తరకం కరోనా కేసుల సంఖ్య 109 ఉండగా.. తాజాగా ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూ కరోనా న్యూ స్ట్రేయిన్‌ (New strain of COVID-19) కేసుల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. 

రోజురోజుకూ పెరుగుతున్న న్యూ స్ట్రెయిన్ (Coronavirus New Strain) కేసులతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యూకే నుంచి వస్తున్న వారందరికీ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ తేలిన వ్యక్తులను ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో సింగిల్ రూం ఐసొలేషన్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా యూకే (UK) నుంచి వచ్చిన వారికి 14 రోజులపాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. Also Read: Farm Laws: అసంపూర్ణంగానే ముగిసిన చర్చలు

బ్రిటన్‌ నుంచి భారత్‌కు గతవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో న్యూ స్ట్రేయిన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం (Central government) అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. Also Read: Budget Session: 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More