Home> జాతీయం
Advertisement

India Covid update: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 9,283 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ తో 437 మంది మృత్యువాతపడ్డారు.  
 

India Covid update: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

India Covid update: దేశంలో కరోనా కేసులు(Corona Cases in India) స్వలంగా పెరిగాయి. మంగళవారం 11,57,697 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,283 మందికి వైరస్ సోకింది. ఒక్క కేరళలోనే 4,972 మంది కరోనా(Covid updates) బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరింది. నిన్న 10,949 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.39 కోట్ల(98.33 శాతం)కు పైగా ఉన్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా క్రియాశీల కేసులు(Active Cases) 537 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో 437 మంది ప్రాణాలు(Covid-19 deaths) కోల్పోయారు. కేరళలో నమోదైన మరణాల సంఖ్యే 370గా ఉంది. మనదేశంలో ఇప్పటి వరకు 4,66,584 మరణాలు సంభవించాయి. మరోపక్క నిన్న 76,58,203 మంది టీకా(corona Vaccination) వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 118 కోట్ల మార్కును దాటింది.

Also Read: Discount On Liquor: కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే లిక్కర్ పై డిస్కౌంట్

వరల్డ్ వైడ్...
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కొవిడ్​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,53,076 మంది వైరస్​ (Corona update) బారినపడ్డారు. కరోనా​ ధాటికి 7,603 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,89,98,324కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 51,82,531కి పెరిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More