Home> జాతీయం
Advertisement

కూలిన ఛార్టర్డ్‌ విమానం.. ఐదుగురు మృతి!

ముంబాయిలోని ఘట్కోపర్‌లో ప్రమాదం జరిగింది.

కూలిన ఛార్టర్డ్‌ విమానం.. ఐదుగురు మృతి!

ముంబాయిలోని ఘట్కోపర్‌లో ప్రమాదం జరిగింది. బహిరంగ ప్రదేశంలో ఛార్టర్డ్‌ విమానం కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముంబైలో కూలిన ఛార్టర్డ్‌ విమానం ఉత్తర్‌ప్రదేశ్‌ది కాదని.. ముంబై యూవై ఏవియేషన్‌కి అమ్మేశామని యుపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

చార్టర్డ్ విమాన ప్రమాదంలో ఒక పాదాచారుడు మరణించినట్లు, మరో ఇద్దరు గాయపడ్డారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

 

 

Read More