Home> జాతీయం
Advertisement

జయపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కమల్ పై కేసు నమోదు ?

తమిళ బిగ్‌బాస్-2కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు.

జయపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కమల్ పై కేసు నమోదు ?

చెన్నై: తమిళ బిగ్‌బాస్-2కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం బిగ్‌బాస్ హౌస్‌ వేదికగా జయను కమల్ అవమానించారంటూ ఆయనపై ఫిర్యాదు నమోదైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితను ‘డిక్టేటర్’గా  సంబోధించారనేదే కమల్ పై ప్రధాన ఆరోపణ. ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయ పార్టీ స్థాపించిన కమల్.. రాజకీయలబ్ది కోసమే జయను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తమ ప్రియతమ నేతను అవమానించిన కమల్‌హాసన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కమల్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై కమల్ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న బిగ్ బాస్ షో రేపు ప్రసారం కానుంది. 

Read More