Home> జాతీయం
Advertisement

నదిలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా

నదిలో పడవ బోల్తా

నదిలో 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా

అస్సాంలోని బ్రహ్మాపుత్ర నదిలో 45 మంది ప్రయాణికులతో వెళ్తు్న్న పడవ నది మధ్యలో బోల్తాపడింది. సమాచారం అందుకున్న వెంటనే అస్సాం పోలీసు బలగాలతోపాటు డిజాష్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రత్యక్షసాక్షులు వెల్లడించిన కథనం ప్రకారం నదిలో పడిన పడవలోంచి కొంతమంది నది ఒడ్డుకు ఈదుకుంటూ రావడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పడవలోని ప్రయాణికులు గౌహతి నుంచి ఉత్తర గౌహతిలోని మధ్యం ఖండకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. 

Read More