Home> జాతీయం
Advertisement

Bus collided with SUV : పెళ్లి బస్సు, కారు ఢీకొని ఐదుగురు మృతి

ఢకియా రోడ్డుపై షాబాద్ మండలం బందర్ గ్రామం వద్ద బొలెరో వాహనం ఓ పెళ్లి బస్సు ఢీకొన్న ఘటనలో బొలెరోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Bus collided with SUV : పెళ్లి బస్సు, కారు ఢీకొని ఐదుగురు మృతి

రాంపూర్: ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో బుధవారం ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢకియా రోడ్డుపై షాబాద్ మండలం బందర్ గ్రామం వద్ద మహీంద్రా బొలెరో వాహనం ఓ పెళ్లి బస్సు ఢీకొన్న ఘటనలో బొలెరోలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వాళ్లంతా అక్కడికి సమీపంలోని రానా షుగర్ మిల్లులో పనిచేసే ఉద్యోగులేనని జిల్లా అదనపు ఎస్పీ విద్యాసాగర్ శర్మ తెలిపారు. మృతులను ముఖేష్, హర్బీర్, శివచరణ్, డిగ్గు, అమిత్‌లుగా గుర్తించారు. ఇదే ప్రమాదంలో పోస్బల్, ఇమ్రాన్, వీరేష్, అంకుష్ తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. 

fallbacks

క్షతగాత్రులను రాంపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తోటి సిబ్బంది మృత్యువాత పడటంతో షుగర్ మిల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More