Home> జాతీయం
Advertisement

బడ్జెట్ 2018: మోదీ మహిళలపై కురిపించిన 5 వరాలు

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం దేశంలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా అనేక పథకాలను, తీసుకోబోయే చర్యలను ప్రకటించారు.

బడ్జెట్ 2018: మోదీ మహిళలపై కురిపించిన 5 వరాలు

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం దేశంలోని మహిళలకు ప్రయోజనం చేకూరేలా అనేక పథకాలను, తీసుకోబోయే చర్యలను ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2018లో మహిళలకు మోదీ కురిపించిన వరాలు ఒకసారి పరిశీలిస్తే..
 
* అరుణ్ జైట్లీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 8 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.   

* "బేటి బచావో బేటి పడావో" కింద, 2015 జనవరిలో 'సుకన్య సమృద్ధి ఖాతా' పథకం ప్రారంభించబడింది. నవంబర్ 2017 వరకు దేశవ్యాప్తంగా 1.26 కోట్ల ఖాతాలు తెరవగా, 19,183 కోట్ల రూపాయలను భద్రపరుచుకున్నారు.

* ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ల కేటాయింపును 2018-19 బడ్జెట్ లో రూ.5750 కోట్లకు పెంచింది. 2016-17 బడ్జెట్ లో మహిళల స్వయం సహాయక బృందాలకు (పొదుపులక్ష్మీ గ్రూప్ ఎస్ హెచ్ జీ) 42,600 కోట్ల రూపాయలను రుణాలుగా ఇచ్చారు. బడ్జెట్ 2018లో ఆ రుణాన్ని 37 శాతానికి పెంచారు.  మార్చి 2019 నాటికి మహిళల స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలు రూ.75,000 కోట్లకు చేరుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

* ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో, మహిళల నుండి కేవలం ఎనిమిది శాతం ఈపీఎఫ్ వసూలు

* వృద్దులు, వితంతువులు, అనాధ పిల్లలు, దివ్యాంగుల కోసం ఈ ఏడాది 'నేషనల్ సోషల్ అసిస్టెన్స్' కార్యక్రమానికి రూ.9,975 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు.. వీటిని సామాజిక భద్రత, రక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.

Read More