Home> జాతీయం
Advertisement

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 16 మంది మృతి!

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 16 మంది మృతి!

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 16 మంది మృతి!

గుర్దాస్‌పూర్‌: బాణాసంచా తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఫ్యాక్టరీ మొత్తం నేలమట్టమైంది. బాణాసంచా ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో పేలుడు ధాటికి వ్యాపించిన పొగతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. బాణసంచా తయారీదారులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టేన్ అమరిందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలంలోనే ఉండి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పంజాబ్ పోలీసు బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Read More