Home> జాతీయం
Advertisement

వృద్ధురాలు సజీవ దహనం..!!

కొండ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలకు 10 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన దుగ్యానీ అనే గ్రామంలో జరిగింది. 

వృద్ధురాలు సజీవ దహనం..!!

కాలి బూడిదైన 10 ఇళ్లు..!!
వృద్ధురాలు సజీవ దహనం..!!
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం..!!

కొండ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలకు 10 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన దుగ్యానీ అనే గ్రామంలో జరిగింది. 

మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక ఇంట్లో చెలరేగిన మంటలు క్రమక్రమంగా కొద్దిసేపటికే 10 ఇళ్లకు వ్యాప్తి చెందాయి. స్థానికులు.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోగానే మంటలు విపరీతంగా వ్యాపించాయి. దీంతో స్థానికులే చాలా వరకు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని కీలలు ఎక్కువగా ఉండడంతో మంటలు ఆర్పేందుకు చాలాసేపు శ్రమించాల్సి వచ్చింది.

fallbacks 

ఈ అగ్ని ప్రమాదంలో ఓ వృద్దురాలు సజీవ దహనమైంది. ఇంట్లోనే నిద్రిస్తున్న వృద్ధురాలికి మంటలు అంటుకున్నాయి. ఆమె ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More