Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

యాత్ర టీజర్: మరో క్లాసిక్ రాబోతోందా..?

మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విడుదల చేశారు.

యాత్ర టీజర్: మరో క్లాసిక్ రాబోతోందా..?

'తెలుసుకోవాలని ఉంది.. వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకీ వెళ్లాలని ఉంది. వాళ్లతో కలిసి నడవాలనుంది. వాళ్ల గుండెచప్పుడు వినాలనుంది. గెలిస్తే పట్టుదలంటారు. ఓడిపోతే మూర్ఖత్వమంటారు. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టదలో.. చరిత్రే నిర్ణయిస్తుంది'

ఈ ఒక్క డైలాగ్‌తో యాత్ర సినిమాలో ఏం చెప్పదలుచుకున్నారో క్లియర్‌గా చెప్పేసింది యూనిట్. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చ‌రిత్రను ‘యాత్ర' పేరుతో మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..! షూటింగ్ ప్రారంభించిన 10 రోజులకే టీజర్ రిలీజ్ చేయడమంటే మాటలు కాదు. కానీ టీజర్ రిలీజ్ చేయకపోతే, వైఎస్ఆర్ జయంతి అనే ఓ మంచి అకేషన్ మిస్ అయిపోతుంది. అందుకే 10 రోజుల ఫుటేజ్‌తోనే టీజర్‌ను రిలీజ్ చేశారు.

మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మమ్ముట్టి ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీకి మమ్ముట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. గతంలో 'స్వాతికిరణం' సినిమాకు కూడా ఈయన సొంతంగానే డబ్బింగ్ చెప్పుకున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. 70 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.  మ‌హి వి రాఘ‌వ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మీరూ చూడండి..

 

 

Read More