Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

బాధ అనిపిస్తోంది.. కోపం వస్తుంది: విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’.

బాధ అనిపిస్తోంది.. కోపం వస్తుంది: విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గీత గోవిందం’. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలకానున్న ఈ సినిమాకు గట్టి షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ వీడియోలు నెట్‌లో వైరల్ కావడంపై చిత్రయూనిట్ షాకయ్యింది.

తాజాగా ఈ విషయంపై  హీరో విజయ్ ట్విట్టర్‌లో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా సన్నివేశాలు లీకయ్యాయన్న విషయాన్ని నేరుగా చెప్పకుండా ‘బాధ, నిరాశ అనిపిస్తోంది. ఒక్కోసారి కోపం వస్తుంది, ఇంకోసారి ఏడుపొస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.  దీంతో  పైరసీని ఉద్దేశిస్తూ విజయ్ ట్వీట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.

 

విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రానికి పరశురాం డైరెక్ట్ చేశారు. ఇందులో విజయ్‌కు సరసన రష్మిక మందన నటించారు. ఆగస్ట్‌ 15న విడుదల కానున్న ఈ చిత్రంలోని కొంత భాగాన్ని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు దొంగలించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

Read More