Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అశ్రునయనాల మధ్య వేణుమాధవ్ అంత్యక్రియలు

వేణుమాధవ్‌కి కన్నీటి వీడ్కోలు

అశ్రునయనాల మధ్య వేణుమాధవ్ అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని మౌలాలీ హౌసింగ్ బోర్డు స్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమలో అన్నివర్గాల వారిని కలుపుకునిపోయే మనస్తత్వం ఉన్న నటుడు కావడంతో సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో వేణుమాధవ్ అంత్యక్రియలకు తరలివచ్చారు. వేణు మాధవ్‌తో అత్యంత సాన్నిహిత్యం కలిగిన నటీనటులు ఆయనతో తమకు ఉన్న జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

అంతకుముందు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ పార్థివదేహాన్ని మౌలాలిలోని ఆయన సొంత నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌ ఛాంబర్‌లో పార్థివదేహాన్ని ఉంచారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మౌలాలి స్మశానవాటికకు వేణుమాధవ్ పార్థివదేహాన్ని అంతిమయాత్రగా తరలించి అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

Read More