Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

పొట్టి నిక్కర్లతో పార్టీ చేసుకున్న టాలీవుడ్ కమెడియన్లు

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు కమెడియన్లు అందరూ కూడా ఒక చిన్న వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారు.

పొట్టి నిక్కర్లతో పార్టీ చేసుకున్న టాలీవుడ్ కమెడియన్లు

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు కమెడియన్లు అందరూ కూడా ఒక చిన్న వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూపుకి ‘ఫ్లైయింగ్‌ కలర్స్‌’ అనే పేరు కూడా పెట్టారు. ప్రతీ నెల ఈ కమెడియన్లు అందరూ కలిసి పార్టీ చేసుకోవాలన్నది ఈ గ్రూపు నిబంధన. అంటే ప్రతీ నెల గ్రూపు సభ్యుల్లో ఎవరో ఒకరు గ్రూపులోని వారందరికీ పార్టీ ఇస్తారన్న మాట. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, నందు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వేణు, సత్య, రఘు, తాగుబోతు రమేష్ మొదలైన వారందరూ ఈ గ్రూపులో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారట.

ఈ గ్రూపు త్వరలో సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుందని.. అవసరమైనప్పుడు తమ తోటి కళాకారులకు సహాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తుందని ఈ గ్రూపు సభ్యులు అంటున్నారు. ప్రతీ నెల అందరూ కలిసి పార్టీ చేసుకొని.. కష్ట సుఖాలు చెప్పుకోవడానికి... అలాగే ఎంజాయ్ చేయడానికే ఈ ‘ఫ్లైయింగ్‌ కలర్స్‌’ అనే కాన్సెప్ట్‌తో తాము ముందుకు వచ్చామని ఈ హాస్య నటులందరూ కూడా అంటున్నారు. అయితే ఈ హాస్యనటుల్లో ఎక్కువమంది జబర్దస్త్ ప్రోగ్రామ్ ఆర్టిస్టులే ఉండడం గమనార్హం. 

ఈ గ్రూపు సభ్యులు తాజాగా ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీ సందర్భంగా ఓ చక్కని థీమ్ కూడా ఎంచుకున్నారు. ఆ థీమ్ ప్రకారం గ్రూపు సభ్యులందరూ కూడా పొట్టి నిక్కర్లు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. నటుడు శ్రీనివాసరెడ్డి ఇటీవలే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘ఫ్లైయింగ్‌ కలర్స్‌’ మీటింగ్‌. సత్య పార్టీ ఇచ్చాడు. మేం రేపటి పౌరులం’ అని ఆయన ఓ మెసేజ్ కూడా పోస్టు చేశారు. 

Read More