Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మెగా ఫ్యామిలీని వదలని శ్రీరెడ్డి, నాగబాబుపై సంచలన ఆరోపణలు

      

మెగా ఫ్యామిలీని వదలని శ్రీరెడ్డి, నాగబాబుపై సంచలన ఆరోపణలు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మోగా ఫ్యామిలీపై తన విమర్శలు కొనసాగిస్తోంది. తాజాగా నాగబాబుపై సంచలన ఆరోపణలు చేసింది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ముఖ్యంగా మోగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు నుంచి ఎక్కవ బెదిరింపు  కాల్స్ వస్తున్నాయని సంచలన ట్వీట్ చేసింది. 

 

పవన్ కల్యాణ్, ఆయన తల్లిపై అసభ్య పదాజాలంతో శ్రీరెడ్డి దూషించిన విషయం తెలిసిందే.  దీనిపై నాగబాబు ప్రెస్ మీట్ నిర్వహించిన శ్రీరెడ్డిని వ్యాఖ్యలను ఖండించడం...శ్రీరెడ్డికి క్లాస్ పీకడం చేశారు.. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్ద  వచ్చి ధర్నా చేసి..శ్రీరెడ్డి వ్యవహారం తేల్చాలని డిమాండ్ చేశారు. పవన్ ధర్నాతో పరిస్థితులు ఒక్కసారిగా వేడేక్కడం.. ఆ తర్వాత పవన్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. ఇక మెగాఫ్యామిలితో శ్రీరెడ్డి వివాదం ఇంతటితో  ముగిసిందని భావించారు. 

కానీ శ్రీరెడ్డి మునుపటికంటే మరింత దూకుడుకుగా వెళ్తోంది. తాజాగా పవన్ ట్వీట్లపై శ్రీరెడ్డి వ్యంగ్యాస్త్రాలు మొదలెట్టింది. దీనికి తోడు నాగబాబుపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన్నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విమర్శించింది. తాజా ఆరోపణలతో ఈ వివాదం మరింత  ముదిరినట్లయింది.

శ్రీరెడ్డి డిమాండ్లపై స్పందించిన టి సర్కార్ శనివారం మంత్రి తలసాని ఆధ్వర్యంలో మావీ ఆర్ట్స్ అసోసియేషన్ తో చర్చలు జరపడం..సినీ ఆర్టిస్టులకు ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతటితో  వివాదం ముగించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని చెప్పినప్పటికీ శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై మరింత దూకుడగా వెళ్లడం గమనార్హం. 

Read More