Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మెగా ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడొస్తున్నాడు

టాలీవుడ్‌లో వారసుల జోరు కొనసాగుతోంది.

మెగా ఫ్యామిలీ నుంచి కొత్త వారసుడొస్తున్నాడు

హైదరాబాద్: టాలీవుడ్‌లో వారసుల జోరు కొనసాగుతోంది. స్టార్‌ల స్ఫూర్తిని కొనసాగిస్తూ వాళ్ల కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా చిరంజీవి కుటుంబం నుంచి మరొకరు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ ఏడాది చిరంజీవి, కృష్ణ కుటుంబాల నుంచి కొత్త హీరోలు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

చిరంజీవి కష్టపడి మెగాస్టార్‌ హోదా వరకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే! ఆయన కుటుంబ సభ్యులు చాలా మందే తెరకు పరిచయమయ్యారు. నాగబాబు, పవన్‌ కళ్యాణ్ మొదలుకొని నిహారికా, అల్లు శిరీష్‌ దాకా దాదాపు పదిమంది టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. స్టార్‌ హీరోలుగా ప్రేక్షకాభిమానం పొందారు. తాజాగా ఆయన అల్లుడు కళ్యాణ్‌ దేవ్ హీరోగా సినిమా చేస్తున్నారు. వారాహి మూవీస్  నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. దీంతో మెగా కుటుంబ వారసుల సంఖ్య 11కు చేరింది.

ఇప్పటికే వైష్ణవ్ తేజ్ మెగా స్టార్ నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిన్న పిల్లవాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం స్క్రిప్టులను వింటున్నాడు. తమ వాళ్లలా సినిమాల కోసం చదువును ఆపేయకుండా  వైష్ణవ్ తన విద్యపై దృష్టి పెడుతూనే, డ్యాన్స్, ఫైటింగ్ లలో శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇక సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి వారసుల పరంపర కొనసాగుతోంది. మహేష్‌బాబు, రమేష్‌ బాబు, మంజుల, సుధీర్‌ బాబు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. సీనియర్ నరేష్‌ కొడుకు నవీన్‌ విజయ కృష్ణ హీరోగా పరిచయమయ్యారు. మరో కుటుంబ సభ్యుడు కృష్ణ మాధవ్‌ ఓ చిత్రంలో నటించారు. తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో ఇద్దరు నటులు వస్తున్నారు. వాళ్లే గల్లా అశోక్‌, జయకృష్ణ. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కొడుకు గల్లా అశోక్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓ సినిమా చేయబోతున్నారు. రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ కూడా కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

Read More