Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

నాతో లైవ్ లో మాట్లాడండి: మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’.

నాతో లైవ్ లో మాట్లాడండి: మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి యు/ఎ స‌ర్టిఫికేట్ ల‌భించింది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయ‌నున్నారు. ఈ క్రమంలో 'గాయత్రి'కి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చిత్ర విశేషాల‌ను అభిమానులతో షేర్ చేసుకునేందుకు ఈరోజు మ‌ధ్యాహ్నం 3.30 నుంచి మోహ‌న్ బాబు ఫేస్‌బుక్‌ లైవ్ లో మాట్లాడనున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్రేక్ష‌కుల అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇస్తారు. మంచు విష్ణు, శ్రియ, నిఖిలా విమ‌ల్, అనసూయ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించారు.

 

Read More