Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మహర్షి రూపంలో మహేష్ సరికొత్త మెసేజ్ !!

భరత్ అనే నేను తరహాలో సరికొత్త మెజేస్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్న మహేష్ బాబు

మహర్షి రూపంలో మహేష్ సరికొత్త మెసేజ్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సరికొత్త కథాంశంతో ముందుకు వస్తున్నాడు. తన నెక్స్ట్ మూవీ 'మహర్షి' లో ఆడియన్స్ కు సరికొత్త మెజేస్ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ మూవీలో రైతు సమ్యస్యలే ప్రధాన అంశంగా  తెరపైకి ఎక్కిస్తున్నట్లు టాక్. ఎమోషనల్ గా  సాగే ఈ మూవీ అదిపోయే క్లైమాక్స్ తో ముగుస్తుందట. రెండేళ్ళ పాటు రెడీ చేసుకున్న కథను అదిరిపోయే క్లైమాక్స్ తో ముగించాడట వంశీ పైడిపల్లి. 

ఇటీవలె తెరపైకి ఎక్కిన  'శ్రీమంతుడు' లో ఇప్పటి ఎవరూ టచ్ చేయని గ్రామాల దత్తతు కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాడు మహేష్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మహేష్ నటించిన భరత్ అనే నేను మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.. యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో చాలా మార్పు వస్తుందనే స్ట్రాంగ్ మెసేజ్ ఆ మూవీలో ఇచ్చాడు. అది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  ఇప్పుడు మహర్షి మూవీతో మళ్లీ తెరపైకి కనిపించున్న మహేష్ ...ఇదే తరహా హిట్ సాధిస్తాడని అభియానులు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఇదే అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

 

Read More