Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Mahesh Babu next movie with KGF director Prashanth Neel : కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమాపై స్పందించిన మహేష్ బాబు

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా ఊరిస్తున్న సినిమా ఇది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేష్ బాబు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మించారు.

Mahesh Babu next movie with KGF director Prashanth Neel : కేజీఎఫ్ డైరెక్టర్‌తో సినిమాపై స్పందించిన మహేష్ బాబు

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్‌ని కూడా ఊరిస్తున్న సినిమా ఇది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేష్ బాబు, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ఇంకొన్ని గంటలే మిగిలిఉంది. అయితే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేదే ఇప్పుడు ఆయన అభిమానులు తెలుసుకోవాలని అనుకుంటున్న విషయం. మహేష్ బాబు చివరి చిత్రం మహర్షి తర్వాత గ్యాప్ తీసుకోకుండా వెంటనే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ స్టార్ట్ చేశారు. అందుకే ఈసారి ఓ రెండు నెలల విశ్రాంతి తీసుకున్న తర్వాత వేసవిలో మరోసారి మహర్షి మూవీ డైరెక్టర్ వంశీ పైడిపల్లితోనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లితో తన తర్వాతి చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. ఈసారి ''మహర్షి''లా సందేశాత్మక చిత్రం కాకుండా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తన తర్వాతి సినిమా ఉండబోతుంది అని స్పష్టంచేశాడు. Sarileru Neekevvaru movie trailer:

 

వంశీ పైడిపల్లితో చేయనున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుండగా ఆ తర్వాత చేయబోయే చిత్రం కూడా అప్పుడే మహేష్ బాబు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణం అది కూడా మరో ప్రముఖ దర్శకుడైన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కావడమే. అవును.. కన్నడ దర్శకుడైన ప్రశాంత్ నీల్ పేరు వింటే గుర్తుకొచ్చే సినిమా కేజీఎఫ్. బాహుబలి తర్వాత దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు బహుభాషల్లో సందడి చేసి, ఇండియన్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించిన సినిమా అది. కేజీఎఫ్ సినిమాను ఆ స్థాయిలో డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్‌తోనూ మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడనే వార్తలు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని మరింత ఆసక్తి కలిగించాయి. సూపర్ స్టార్‌తో మరో సూపర్ డైరెక్టర్ సినిమా తీస్తే... కచ్చితంగా ఆ సినిమా సూపర్ రేంజ్‌లో ఉంటుందనేది అభిమానల అభిప్రాయం. 

ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో చర్చలు జరుగుతున్నాయని.. అవి ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. మహేష్ బాబు - ప్రశాంత్ నీల్ కాంబో ఓకే అయితే.. కచ్చితంగా ఆ సినిమా అభిమానులకు కన్నుల పండగే అవుతుంది. మామూలుగానే మహేష్ బాబు సినిమా అంటే ఆడియెన్స్‌కి ఎంతో క్రేజ్... ఇక కేజీఎఫ్ దర్శకుడితో సినిమా అంటే అది మరో స్థాయిలో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Read More