Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

సరిహద్దుల్లో ఫైట్ చేసేందుకు సిద్ధమంటున్న మహేష్ బాబు !!

భారత్ అనే నేను సినిమాలో ముఖ్యంత్రి పాత్రలో అసెంబ్లీలో ఫైట్ చేసిన సూపర్ స్టార్ మహాషేబాబు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీలో మేజర్ పాత్రలో సరిహద్దుల్లో ఫైట్ చేసేదుకు రెడీ అంటున్నాడు

సరిహద్దుల్లో ఫైట్ చేసేందుకు సిద్ధమంటున్న మహేష్ బాబు !!

'భారత్ అనే నేను'లో ముఖ్యమంత్రిగా కనిపించిన మహేష్ బాబు ఇప్పుడు సరికొత్త పాత్రలో కనిపించేందుకు సిద్ధమౌతున్నాడు. '' సరిలేరు నీకెవ్వరు'' పేరుతో తెరకెక్కుతున్న మూవీలో ఆర్మీ మేజర్ గెటప్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తున్నాడు. 

అనిల్ రావిపూడి డైరక్షన్ లో '' సరిలేరునీకెవ్వరు'' షూటింగ్ కు సంబంధించిన   ఫస్ట్ షెడ్యూల్ ని కాశ్మీర్ లోనే ప్లాన్ చేసుకున్నారు. అయితే పనిలో పనిగా సినిమాలో మహేష్ బాబు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు మేకర్స్. ఈ మూవీలో మహేష్ బాబు  మేజర్ అజయ్ కృష్ణ గా కనిపించబోతున్నాడు .

మాస్ మరియు క్లాస్ ఇలా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకులా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. అటు యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికైతే చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది . 

రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి విజయశాంతి సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకశ్వర క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న సినిమాకు డి.ఎస్.పి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీ ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసుకొని 2020 లో సంక్రాంతి కానుకగాఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్

Read More