Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్..

పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో మరో శుభవార్తనందించింది. రానున్న కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు లైఫ్‌ సర్టిఫికెట్‌(జీవన్‌ ప్రమాణ్‌)ను అందజేయడంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్‌ 

పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్..

హైదరాబాద్: పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో మరో శుభవార్తనందించింది. రానున్న కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు లైఫ్‌ సర్టిఫికెట్‌(జీవన్‌ ప్రమాణ్‌)ను అందజేయడంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ మరో వెసులుబాటు కల్పించింది. కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చని, కోవిడ్‌ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం(ఈపీఎస్‌) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 

Also Read: నిరంతరంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు..

మరోవైపు పింఛనుదారులు ఏటా డిసెంబర్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉండగా దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో  తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు కల్పిస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు అదనంగా ఉంటాయని పేర్కొంది. పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More