Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

సల్మాన్ కేసు వల్ల.. ఆ హీరోయిన్లు బాగా నష్టపోయారట..!

దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారి.. ఈ హీరోయిన్లు అందరూ సల్మాన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి వస్తున్న సందర్భంలోనే వీరు జిప్సీలో ప్రయాణిస్తూ నల్లజింకలు ఉండే అటవీ ప్రాంతానికి వెళ్లారు.

సల్మాన్ కేసు వల్ల.. ఆ హీరోయిన్లు బాగా నష్టపోయారట..!

దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారి.. ఈ హీరోయిన్లు అందరూ సల్మాన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి వస్తున్న సందర్భంలోనే వీరు జిప్సీలో ప్రయాణిస్తూ నల్లజింకలు ఉండే అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే ప్రాంతంలో సల్మాన్ జింకలను వేటాడాడని కేసు నమోదైంది.

అయితే అదే కేసు ఆ హీరోయిన్లకు కలిగించిన ఆర్థిక నష్టం అంతా ఇంతా కాదట. పలు సందర్భాల్లో వారే ఈ మాటలు అన్నారు. నిన్నే ఈ కేసుకి సంబంధించి తుది తీర్పు వెలువడ్డాక.. సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ఈ హీరోయిన్లు అందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సల్మాన్‌కి మాత్రం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.

ఒకవైపు తమను నిర్దోషులుగా కోర్టు ప్రకటించిందని సంతోషపడాలో లేదా తమలో ఒక్కడైన సల్మాన్‌కి జైలుశిక్ష పడిందని తెలిసి బాధపడాలో.. ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారట వారు. ఈ క్రమంలో వారు ఈ కేసు నడుస్తున్నప్పుడు పడిన మానసిక సంఘర్షణను కొందరు మీడియావారితో పంచుకున్నారని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఈ కేసు ఆయా హీరోయిన్లకు కలిగించిన ధన నష్టం కూడా అంతా ఇంతా కాదని అంటున్నారు. ముఖ్యంగా లాయర్లకు భారీస్థాయిలో ఫీజు చెల్లించుకోవాల్సి రావడంతో వారు పడిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని సమాచారం. ఆ సంఘటన జరిగిన తర్వాత.. ఆ హీరోయిన్లు అందరూ ఈ కేసు విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి.. ఒకరితో ఒకరు టచ్‌లో కూడా ఉన్నారట. అయితే వారు ఆ తర్వాత సినిమాలలో పెద్దగా నటించకపోవడంతో తమ పర్సనల్ సేవింగ్స్ నుంచే డబ్బు లాయర్ల ఫీజులకు బాగా చెల్లించాల్సి వచ్చిందని సమాచారం. 

Read More