Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

VIDEO: మురుగన్ గుడిలో స్వయానా వినాయకుడు దర్శనమిచ్చాడట..!

కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోకి స్వయాన ఆ వినాయకుడే వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు.

VIDEO: మురుగన్ గుడిలో స్వయానా వినాయకుడు దర్శనమిచ్చాడట..!

కోయంబత్తూరులోని అనుభవి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోకి స్వయాన ఆ వినాయకుడే వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు. వివరాల్లోకి వెళితే ఈ సోమవారం నాడు అదే ఆలయంలో అర్థరాత్రి వేళ ఓ గజరాజు ఆలయంలోకి అడుగుపెట్టి.. ప్రాంగణమంతా కలియతిరగడం జరిగింది. సీసీటీవీల్లో ఈ సంఘటనను చూసిన గుడి యాజమాన్యం ఆశ్చర్యపోయింది.

అసలు ఆలయంలోకి ఏనుగు ఎలా వచ్చిందో తమకు అర్థం కాలేదని వారు అంటున్నారు. అదే ఏనుగు వంటగదిలోకి వెళ్ళి ఆహారం తినడం కూడా పలువురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా దైవమహిమగా ఆ ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఆ ఆలయాన్ని దర్శించడానికి భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారట. 

అయితే ఈ విషయాన్ని అభూత కల్పనగా కొట్టిపారేస్తు్న్నారు కొందరు నాస్తికులు. కోయంబత్తూరులో ఉన్న ఈ ఆలయం అడవులకు సమీపంగా ఉందని.. ఏ క్రూరజంతువైనా రాత్రివేళల్లో ప్రాంగణంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని.. ఆ మాత్రం దానికి దీనిని దైవమహిమగా భావించడం మూర్ఖత్వమని వారు అంటున్నారు. ఏదేమైనా గుడిలోకి అడుగుపెట్టిన ఏనుగు, ఆహారాన్ని భుజించి వెళ్లడంతో.. స్వయానా ఆ విఘ్నేశ్వరుడే ఏనుగు రూపంలో తన సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని గుడి వచ్చాడని కొందరు భక్తులు వాదిస్తున్నారు. 

Read More