Home> వినోదం
Advertisement

SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా హీరో.. ఇంతకీ ఎవరంటే

SSMB 29 Update: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే ఎస్ఎస్ఎంబి 29.. చిత్రంలో విలన్ గా పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా…ప్రస్తుతం ఈ వార్త మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా హీరో.. ఇంతకీ ఎవరంటే

SSMB 29 release date: తెలుగు సినీ పరిశ్రమలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రాలలో మహేష్, రాజమౌళి.. కాంబోలో వస్తున్న SSMB -29 కూడా ఒకటి. ఈ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడెప్పుడు పోస్టర్స్ బయటకి వస్తాయి.. అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. కానీ ఎన్నో రూమర్స్ మాత్రం ఇప్పటికీ.. వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక విషయం వైరల్ గా మారుతున్నది. మహేష్ బాబుని ఢీ కొట్టే.. పాత్రలో మలయాళ నటుడిని తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. వాటి గురించి చూద్దాం..

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB-29 సినిమా స్టోరీ ఫారెస్ట్ అడ్వెంచర్  స్టోరీ అని .. ఆఫ్రికన్ అడవుల్లో సినిమా తీయబోతున్నామని ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా లొకేషన్స్ కోసం అటు మహేష్ బాబు, రాజమౌళి కూడా విదేశాలకు వెళ్లి రావడం జరిగింది. మహేష్ బాబు ఈ చిత్రం కోసం కసరత్తులు.. కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే SSMB29 చిత్రంలో.. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. విలన్ గా నటించబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. 

ముఖ్యంగా రాజమౌళి వంటి దర్శకుల సినిమాలలో ఎలాంటి పాత్ర వచ్చినా కూడా నో చెప్పే నటీనటులు.. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందుకే పృధ్వీరాజ్ సుకుమారన్.. ఈ సినిమాలో ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. ఇక RRR సినిమా చేస్తున్న సమయంలోనే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని కూడా అంతర్జాతీయంగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.  అందుకే SSMB -29 చిత్రం మీద కూడా మరింత ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించే విధంగా రాజమౌళి ప్లాన్ చేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇప్పటికే కథను కూడా రాసినట్లుగా సమాచారం. మరి చిత్ర బృందం అధికారికంగా నటీనటుల గురించి వెల్లడిస్తారేమో చూడాలి.

Also read: Farmer Registry: పీఎం కిసాన్ నిధి వచ్చే వాయిదా కావాలంటే కిసాన్ రిజిస్ట్రీ తప్పదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More