Home> వినోదం
Advertisement

Sai Pallavi: స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. తెలుగు ఇండస్ట్రీ నన్ను..!!

శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
 

Sai Pallavi: స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.. తెలుగు ఇండస్ట్రీ నన్ను..!!

Sai Pallavi gets emotional at Shyam Singha Roy's pre release event: 'న్యాచురల్ స్టార్' నాని (Nani) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy). డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ చిత్ర బృందం ఇటీవల ప్రొమోషన్స్‌ను వేగవంతం చేసింది.ఈ క్రమంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

'పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు నన్ను అందరూ క్షమించండి. ఇక్కడ ఇంతమంది అభిమానులు చూడడం కనుల పండగలా ఉంది. ఈరోజు మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే.. ఎంతో భావోద్వేగానికి గురవుతున్నా. శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఇక్కడికి వచ్చా. కానీ ఇప్పుడు మాటలు రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి, నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న దర్శకులందరికీ కృతజ్ఞతలు చెపుతున్నా.  అలానే అభిమానులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెపుతున్నా' అని సాయి పల్లవి (Sai Pallavi) అన్నారు.

Also Read: Ashes 2021: ఇంగ్లండ్​కు షాక్.. జో రూట్​కు గాయం! భారీ లక్ష ఛేదన కష్టమే!!

'నేనెంతో శ్రమించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చాలా మంది నాతో అంటుంటారు. నిజం చెప్పాలంటే.. నేను ఏ సినిమాని కష్టంగా భావించి పని చేయను. ఎంతో ఇష్టపడి చేస్తా. అందుకే ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ ఉంటాను. నేషనల్‌ అవార్డు అందుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటానని అనుకున్నాను. కానీ ఒక నటిగా ఈ స్టేజ్‌పై ఉండటమే ఓ పెద్ద అవార్డు అని ఈరోజు అర్థమైంది. అందుకే నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇక ఈ సినిమా బాగా వచ్చింది. అందరికి నచ్చుతోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా పెద్ద  సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని సాయి పల్లవి (Sai Pallavi) పేర్కొన్నారు. 

Also Read: Instagram Love & Kidnap: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ నాటకం, ఆ పై కిడ్నాప్

కలకత్తా బ్యాక్‏డ్రాప్‏లో పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) సినిమాలో నాని (Nani) రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించనున్నాడు. సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) దేవదాసిగా కనిపించనున్నారు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ శ్యామ్ సింగరాయ్ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది. పాటలు కూడా బాగున్నాయి. నాని, సాయి పల్లవి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఎంసీఏ భారీ హిట్ సాదించిన విషయం తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More