Home> వినోదం
Advertisement

టాలీవుడ్ "టెంపర్"లో రణ్‌వీర్ సింగ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన "టెంపర్" చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో మనకు తెలియని విషయం కాదు. 

టాలీవుడ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన "టెంపర్" చిత్రం ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో మనకు తెలియని విషయం కాదు. ఇప్పుడు అదే సినిమాని బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి "సింబా" అనే పేరు కూడా పెట్టారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది.

ఈ చిత్రంలో ర‌ణ్‌వీర్ సింగ్ పక్కన హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వి క‌పూర్‌ని ఎంపిక చేసే అవకాశం ఉందని వినికిడి. 2018 ప్రథమార్థంలో షూటింగ్ జరుపుకొనే ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌- రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌- ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని సమాచారం. ఈ చిత్రంలో హీరో పోషించే పాత్ర పేరు సంగ్రామ్‌ భలేరావ్‌ అని చెబుతూ ఇటీవలే రణ్‌వీర్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

 

Read More