Home> వినోదం
Advertisement

Rakul Preet Singh: సోషల్ మీడియా నుంచి దూరంగా రకుల్

సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే. 

Rakul Preet Singh: సోషల్ మీడియా నుంచి దూరంగా రకుల్

సుశాంత్ సింత్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత రియా చక్రవర్తి ( Rhea Chakraborty ) చుట్టు ఉచ్చు బిగియడంతో ఇందులో డ్రగ్స్ యాంగిల్ బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్సీబి ( NCB ) అధికారులు సినీ తారలను కూడా విచారించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. ఆమెను ముంబైకి పిలిచి అక్కడ కొన్ని గంటల పాటు నార్కోటిక్స్ అధికారులు ప్రశ్నించారు. తరువాత ఆమె హైదరాబాద్ కు తిరిగి వచ్చి సినిమా షూటింగ్ లో చేరిపోయింది.ఈ విచారణ తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కాస్త డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది. 

ALSO READ|  Kane Williamson Memes: కేన్ విలియమ్సన్ పై ట్రెండ్ అవుతున్న మేమ్స్

క్రిష్ తెరకెక్కిస్తోన్న ఒక చిత్రంలో రకుల్ (Rakul Preet Singh ) కథానాయికగా నటిస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ కథానాయకుడు. అక్టోబర్ లో ఈ చిత్రం షూటింగ్ ముగించే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ( Social Media ) యాక్టివ్ గా ఉంటున్నారు. అందులో రకుల్ కూడా ఒకరు. అయితే డ్రగ్స్ కేసులో ఆమె పేరు వచ్చినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటున్నారు. తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో ఎలాంటి పోస్టులు పెట్డడం లేదు.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

ట్విట్టర్ లో రకుల్ ను 4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. రకుల్ చివరిగా సెప్టెంబర్ 7న ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో రకుల్ గత రెండు వారాలుగా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఆమెను 16 మిలియన్ల మంది ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Read More