Home> వినోదం
Advertisement

Sharwanand: శర్వానంద్ సినిమా కోసం బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్న నిర్మాతలు..

People Media Factory: యువ హీరో శర్వానంద్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. అయితే శర్వానంద్ మార్కెట్ కంటే నిర్మాతలు సినిమా కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్ అనుకున్న బడ్జెట్ దాటేసిందని సమాచారం. 

Sharwanand: శర్వానంద్ సినిమా కోసం బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెడుతున్న నిర్మాతలు..

Sharwanand: 

ఈ మధ్యనే ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న శర్వానంద్ తాజాగా ఇప్పుడు భలే మంచి రోజు, శమంతకమణి ఫేమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70% కంటే ఎక్కువగానే పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ ఈ సంవత్సరం అయిపోయేలోపు పూర్తి కావాల్సి ఉంది.అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే ఖర్చు అయిందట.

ఇక మిగతా షూటింగ్ పూర్తి చేయడం కోసం మరొక 50 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చని తెలుస్తోంది. కానీ అనుకున్న బడ్జెట్ కంటే నిర్మాతలు ఎక్కువగా పెట్టాల్సిన ఈ 50 కోట్లు శర్వానంద్ మార్కెట్ కంటే ఎక్కువ అవుతుంది. ఎంత సినిమా కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ కేవలం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ తో సినిమా బడ్జెట్ ని వెనక్కి తీసుకురావడం కష్టమైన పని అవుతుంది. 

నిజానికి చిత్ర నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇలాంటిది జరగటం మొదటిసారి కాదు. హీరోలకి హీరోయిన్లకి భారీ రమ్యునరేషన్లు ఇచ్చేస్తూ బడ్జెట్ ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమాకి కూడా ఇప్పుడు అదే ఇబ్బంది వచ్చి పడింది. కానీ అందులో శర్వానంద్ తప్పు కంటే నిర్మాత, డైరెక్టర్ల తప్పే కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో కృతి శెట్టి సుభద్ర అనే పాత్ర పోషిస్తుంది. హీరోతో రొమాంటిక్ ట్రాక్ మాత్రమే కాక కృతి శెట్టికి సినిమాలో ఒక కీలకమైన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని గ్రాండ్ గా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. టీ జీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడం కేవలం శర్వానంద్ కి మాత్రమే కాక డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, కృతి శెట్టి లకి కూడా కీలకం కాబోతోంది. మరి బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్న ఈ సినిమా నిర్మాతలకి ఎంతవరకు ప్రాఫిట్ లో తెచ్చి పెడుతుందో చూడాలి.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More