Home> వినోదం
Advertisement

Radhe Shyam shooting: ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్ అండ్ టీమ్ ?

Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Radhe Shyam shooting: ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఇటలీకి ప్రభాస్ అండ్ టీమ్ ?

Prabhas ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో ( Radhe Shyam ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే ( Pooja Hegde ) జంటగా నటిస్తోంది. లాక్ డౌన్ సడలింపుల తరువాత సెప్టెంబరు 2వ వారం నుంచి ఈ మూవీ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం మేకర్స్ హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో రూ. 6 కోట్ల విలువైన వివిధ సెట్లను నిర్మించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కాని తాజాగా నిర్మాతలు తమ ప్లాన్ మార్చుకుని చివరకు సినిమా యూనిట్‌ను ఇటలీలో షూటింగ్‌కి పంపిస్తున్నట్టు సమాచారం. Also read : Prabhas, Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్

సెట్టింగ్స్ వేసి కాకుండా డైరెక్ట్ ఒరిజినల్ లొకేషన్స్‌లోనే అనేక కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రభాస్, అలాగే రాధే శ్యామ్ బృందం ప్రత్యేక చార్టర్ విమానంలో ( Special charter flights ) ఇటలీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. కరోనా కేసులకు హాట్‌స్పాట్‌ అయిన ఇటలీలోనే సినిమా షూటింగ్ చేయడానికి వెళ్తుండటంపై సినీవర్గాల్లో చర్చ మొదలైంది. Also read : KGF Chapter 2: ప్రకాష్ రాజ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ దర్శకుడు 

పర్యాటక ప్రదేశాలకు యూరప్ ( Tourist spots in Europe ) పెట్టింది పేరు. కరోనా లాక్‌డౌన్‌ల తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ పర్యాటక ప్రదేశాలలో ఇప్పుడు జనారణ్యం ఎక్కువగా ఉండదు కనుక షూటింగ్ చేయడానికి అనువైన సమయం అని రాధే శ్యామ్ బృందం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణాలతో కరోనా రిస్క్ పొంచి ఉండటంతో ప్రభుత్వం అనుమతితో ఇటలీ వెళ్లడానికి ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ( Special flight ) ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయంపై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూనిట్ ఇంత రిస్కు తీసుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ( Director Nag Ashwin ) ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా అనంతరం తన్హాజీ డైరెక్టర్ ఓం రావుత్ తెరకెక్కించనున్న దృశ్యకావ్యం ఆదిపురుష్ మూవీలో ( Adipurush movie ) ప్రభాస్ నటించనున్నాడు. Also read : Adipurush: మూవీ కోసం ప్రభాస్ ఎలా మారుతున్నాడో తెలుసా

Read More