Home> వినోదం
Advertisement

Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

Adipurush Telugu States Rights: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాని తెలుగులో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యు వి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ నుంచి యూవీ క్రియేషన్స్ సంస్థ తప్పుకుంది. 
 

Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

People Media Factory Bagged Telugu States Rights of Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొని ఉంది. తానాజీ వంటి బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం, బాలీవుడ్ కి చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ టీ సిరీస్ సంస్థతో కలిసి ఓం రౌత్ నిర్మిస్తూ ఉండడంతో మొదటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమయంలో చిన్నపిల్లల కార్టూన్స్ ఈ టీజర్ కంటే బాగుంటాయని విమర్శల వర్షం మొదలైంది.

దీంతో సినిమా విడుదల వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మీద మరింత దృష్టి పెట్టి తాజాగా ట్రైలర్ తోటి సినిమా మీద మరింత అంచనాలు పెంచేలా ప్లాన్ చేశారు. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని స్పెషల్ త్రీడి థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తెలుగు హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి ఈ సినిమాని తెలుగులో ప్రభాస్ సన్నిహితులకు చెందిన యు వి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ నుంచి యూవీ క్రియేషన్స్ సంస్థ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Krithi Shetty Photos: సమంత స్టైలిస్ట్ డిజైన్ చేసిన చీరకట్టులో కృతి శెట్టి.. ఏమన్నా అందమా?

నిజానికి యువి క్రియేషన్స్ సంస్థకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి చాలా ఒత్తిడి పెరిగిపోయిందని దాని పాత సినిమాలకు సంబంధించిన రికవరీల నేపథ్యంలో డబ్బులు ఇవ్వకుండానే తమకు హక్కులు ఇవ్వాలని ప్రెషర్ పెడుతూ ఉండడంతో సినిమా హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు భారీ అమౌంట్ కి అమ్మేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా హక్కులను దాదాపు 185 కోట్ల రూపాయలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క నైజాం హక్కులు మాత్రమే దాదాపు 80 కోట్ల వరకు పలికాయి అనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద యువి క్రియేషన్స్ సంస్థ పక్కకి తప్పుకోవడంతో వరుస సినిమాలతో జోష్ మీద ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ అనే సినిమాని యువి క్రియేషన్స్ తో కలిసి టి సిరీస్ సంస్థ నిర్మించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ ఆ విషయంలో కూడా వెనక్కి తగ్గడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతుందని అంటున్నారు. నిజానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని నిర్మిస్తోంది. ఇప్పుడు ఆ సినిమా కాకుండా ఆది పురుష్ హక్కులు కొనుక్కోవడమే కాదు స్పిరిట్ సినిమాని కూడా నిర్మించడానికి సిద్ధమైంది. అలా మొత్తం మూడు సినిమాలకు ప్రభాస్తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పనిచేయబోతోందని అంటున్నారు. 

Also Read: Raashii Khanna Photos: ఐఫా అవార్డుల ఈవెంట్లో హాట్ బాంబ్ లా మారిన రాశిఖన్నా.. అందాల రాశులు చూడతరమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

 
Read More