Home> వినోదం
Advertisement

బాబాయ్ వెంటే మేమంటున్న అబ్బాయిలు

బాబాయ్ వెంటే మేమంటున్న అబ్బాయిలు

తెలంగాణలో తన ప్రజా యాత్రను ప్రారంభించిన సినీనటుడు, జనసేన పార్టీ అధినేతకు మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌ల నుంచి మెగా సపోర్ట్ లభించింది. పవర్ స్టార్ వెంటే మేము అంటూ బాబాయ్‌కి, అంకుల్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా హీరోలు ట్విటర్ ద్వారా తమ మద్దతు తెలియజేశారు. 

 

సోమవారం కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానంతరం కరీంగనగర్‌ టాన్‌కి చేరుకున్న పవన్‌ కల్యాణ్ అక్కడ విలేకర్లతో సమావేశమైన సందర్భంగా "నేను భారతీయుడిని. నా మాతృభూమిని జాగ్రత్తగా చూసుకుంటాను" అని అన్నారు. పవన్‌ చేసిన ఆ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ చరణ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టగా.. మీ వెంటే మేము. జై జనసేన అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు.

Read More