Home> వినోదం
Advertisement

Nagarjuna: సమంతతో విడాకులు.. చైతూ బాధ చూడలేకపోయా..!

Nagarjuna about Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున ప్రస్తుతం సినిమాలకు.. కాస్త గ్యాప్ ఇచ్చి కొడుకుల భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాగచైతన్య పెళ్లి గురించి ఆలోచించి.. శోభితతో ఎంగేజ్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. నాగార్జున సమంతతో నాగచైతన్య విడాకులు ఇచ్చిన తరువాత.. జరిగిన కొన్ని సంఘటనల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..

Nagarjuna: సమంతతో విడాకులు.. చైతూ బాధ చూడలేకపోయా..!

Naga Chaitanya- Samantha: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున తాజాగా తన పెద్ద కొడుకు నాగచైతన్యకు దగ్గరుండి మరీ.. శోభిత ధూళిపాళ తో నిశ్చితార్థం జరిపించారు.  అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభితతో డేటింగ్ చేసి.. ఆగస్టు 8వ తేదీన అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 

ఈ క్రమంలో సమంత అభిమానులు.. సోషల్ మీడియాలో నాగచైతన్య పై విరుచుకుపడుతున్నారు. విడాకులు ముందే.. శోభితతో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నారని.. అందుకే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు.  కాగా ఈ వార్తపై సమంత మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాగార్జున సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య బాధపడ్డాడు అంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. ‘సమంత తో విడాకుల తర్వాత నాగచైతన్య చాలా బాధపడ్డాడు. ఆ బాధను ఎవరితోనో పంచుకోలేదు. ఇప్పుడు తిరిగి సంతోషంగా ఉండడం చూస్తుంటే ముచ్చటేస్తోంది’.. అంటూ తెలిపారు. 

అంతేకాదు శోభిత  - నాగచైతన్య పెళ్లి త్వరలోనే ఉంటుందంటూ వార్తలు రాగా..నాగార్జున మాట్లాడుతూ పెళ్లికి ఇంకా ఆలస్యం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా.. ఉండడం వల్లే పెళ్లికి ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. 

కాగా.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న.. తండేల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండడం, రాజు అనే శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగచైతన్య పోషిస్తుండటంతో.. ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి ఉంది. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‍లో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు..చందూ మొండేటి.. తండేల్‍కు దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సమంత.. మా ఇంటి బంగారం అనే చిత్ర షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమాకి ఈ హీరోయిన్ నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకోవడం గమనర్హం. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించిన సమంత.. సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకొని.. ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులకు సైన్ చెయ్యడానికి సిద్ధమైనట్లు వినికిడి.

Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More