Home> వినోదం
Advertisement

Mohan Babu: ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై : మోహన్‌బాబు

Mohan Babu:  ఏపీ మంత్రి పేర్నినానితో భేటీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు మోహన్‌బాబు. అంతేకాకుండా కొన్ని ఆసక్తికర ఆంశాలను చర్చించారు. 
 

Mohan Babu: ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై : మోహన్‌బాబు

Mohan Babu Hot Comments: ఏపీ మంత్రి పేర్నినానితో (perni nani) భేటీపై డైలాగ్ కింగ్ మోహన్‌బాబు(Mohan Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని.. ఇంటికొస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇటీవల ఇద్దరం ఓ పెళ్లిలో కలిశామన్నారు. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)తో ఇండస్ట్రీ వాళ్లు  చర్చించిన అంశాలేవీ తమ మధ్య చర్చకు రాలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కొంతమంది అనవరసరంగా రాద్ధాంతం చేశారని మోహన్ బాబు మండిపడ్డారు. 

''ప్రస్తుతం తాను సినిమాలు, యూనివర్సిటీ పనుల్లో బిజీగా ఉన్నానని... ఇకపై ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు'' డైలాగ్ కింగ్ మోహన్ బాబు చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, జగన్ నాకు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 

మోహన్ బాబు నటించిన తాజా చిత్రం‘'సన్‌ ఆఫ్‌ ఇండియా' (Son of India). ఈ సినిమాకు డైమండ్‌ రత్నబాబు (Diamond Ratnababu) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రీకాంత్‌, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు చేశారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహారించారు. ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ఈ చిత్రం. 

Also Read: Son of India: 'వారి మధ్య ముద్దు సీన్లు'.. మోహన్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More