Home> వినోదం
Advertisement

Guntur Kaaram: పట్టుబట్టి థియేటర్ కి తీసుకెళ్లిన మహేష్ బాబు.. సినిమా చూసి సితార, గౌతమ్ ఏమన్నారో తెలుసా!

Guntur Kaaram Collections: సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం. మొదటి షో నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు.. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
 

Guntur Kaaram: పట్టుబట్టి థియేటర్ కి తీసుకెళ్లిన మహేష్ బాబు.. సినిమా చూసి సితార, గౌతమ్ ఏమన్నారో తెలుసా!

Mahesh Babu Guntur Kaaram: త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన సినిమా గుంటూరు కారం. అతడు,‌ ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ చిత్రం వస్తూ ఉండటంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో స్పందన తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఈ సినిమా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కానీ మహేష్ బాబు మాత్రం తన గుంటూరు కారం సినిమాకు ఓ రేంజ్‌లో కలెక్షన్లు వస్తున్నాయని, తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్‌లా డైలాగ్స్ ఎవ్వరూ రాయలేరని, ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ సీన్స్ ఆయన అద్భుతంగా రాశారు అని అన్నాడు. 

ఈ సినిమాని ఎలాగైనా తన ఫ్యామిలీ అంతటినీ హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్‌కు తీసుకెళ్లి సినిమా చూపించాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఇదే విషయాన్ని నమ్రతతో చెబితే.. షాక్ అయ్యారట. అదెలా సాధ్యం.. అందరం వెళ్తే ఇబ్బంది కదా? అని అన్నారట. కానీ మహేష్ మాత్రం పట్టుబట్టి థియేటర్ కి తీసుకెళ్లారట. అన్ని ఏర్పాట్లు చేసి మరి  తన ఫ్యామిలీకి అభిమానిల మధ్య గుంటూరు కారం సినిమా చూపించారట. నమ్రితతో పాటు తన పిల్లలిద్దరిని సుదర్శన్‌కు తీసుకెళ్లగా.. గుంటూరు కారు సినిమా చూసి సితార హగ్ చేసుకుందట. అద్భుతంగా ఉందని, అద్భుతమైన ఫీలింగ్ కలిగిందని..సినిమా బాగా చేశావ్ అని అనేసిందట. మరోపక్క గౌతమ్ అయితే.. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ని నమ్మలేకపోతోన్నా అని ఆశ్చర్యపోయారట.

ఇలా తన పిల్లలు గుంటూరు కారం సినిమా చూసి ఎగ్జిట్ అయిన విషయాన్ని మరింత ఎక్సైటింగ్ గా బయటపెట్టారు మహేష్ బాబు.

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More